ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు నందుని కడకు వచ్చుట
బలుఁడుఁ దానును నందుపాలి కేతెంచి
కలిసి యాతనిఁ జిక్క కౌఁగిటఁ జేర్చి
భోజాధిపతి యింటఁ బొలుచు వస్తువులు
రాజ్యయోగ్యములైన రవణంబులిచ్చి
యతని మన్నించి నెయ్యము తియ్యదనము
నతిగారవంబున నమర నిట్లనియె. - 290
“నీవు నీ సతియును నెమ్మిఁ బోషించి
ప్రోవఁగఁ బ్రతికిన ప్రోఢల మేము
తల్లియుఁ దండ్రియు ధనములియ్యమును
నెల్ల బంధువులును నిటమాకు నీవ;
మందలోపలికి నెమ్మది నేఁగి మీర
లందఱి సేమంబు లడిగితి మనుఁడు;
యేనాఱుదినముల యీలోనె నచటి
కే నేఁగుదెంచెద నీవంతమాను”,
మనివారి నూరార్చి యనుప నందుండుఁ
జనియె గోపాలకసమితియుఁ దాను.
అంతట నిశ్శంక నారాత్రి సౌఖ్య
సంతోషలీలలు సలిపిరింపొంద
మరునాఁడు శౌరి కుమారులఁ జూచి